https://hostinger.in?REFERRALCODE=I60SHAKTHNQD

https://hostinger.in?REFERRALCODE=I60SHAKTHNQD
https://hostinger.in?REFERRALCODE=I60SHAKTHNQD

YOGA ASANAS 1

YOGA HEALTH

Monday, June 29, 2020

NINE HOLES OF THE BODY

సర్వ — సమస్తమైన; కర్మాణి — కర్మలు; మనసా — మనస్సు చే; సన్న్యస్య — త్యజించి; అస్తే — ఉండును; సుఖం — సుఖముగా; వశీ — ఆత్మ నిగ్రహం కలవారు; నవ-ద్వారే — తొమ్మిది మనసా
ద్వారములు కల; పురే — నగరములో; దేహీ — దేహములొఉన్న జీవాత్మ; న — కాదు; ఏవ — నిజముగా; కుర్వన్ — చేయునది; న — కాదు; కారయన్ — కారణము కాదు.

ఆత్మ నిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మలు, తాము దేనికీ కర్త కాదని, దేనికీ కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క తొమ్మిది ద్వారములు కల నగరములో సంతోషంగా ఉంటారు.

భావం:
నవ రంధ్రాలు గల శరీరమును, తొమ్మిది ద్వారాలు గల పట్టణంతో పోల్చుతున్నాడు శ్రీ కృష్ణుడు. జీవాత్మ ఆ పట్టణానికి రాజు, దాని పరిపాలన అంతా అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు మరియు జీవ-శక్తి అనే మంత్రిత్వ శాఖల ద్వారా నడిపింపబడుతాయి. కాలము, మృత్యు రూపంలో, శరీరాన్ని తీసివేసే వరకే, ఈ శరీరంపై రాజ్యపాలన కొనసాగుతుంది. కానీ, పాలన కొనసాగుతున్నప్పుడు కూడా, జ్ఞానోదయమయిన యోగులు తమను తాము శరీరంగా భావించరు, అంతేకాక, తమను తాము ఈ శరీరానికి అధిపతులము అనుకోరు. సరికదా, శరీరమును, దానిచే చేయబడిన అన్ని క్రియలను భగవంతునికే చెందినవని భావిస్తారు. అన్ని కర్మలను మానసికంగా త్యజించి, ఇటువంటి జ్ఞానోదయమైన యోగులు సంతోషంగా ఈ శరీరంలో స్థితులై ఉంటారు. దీనినే, 'సాక్షీ భావము' అంటారు, అంటే, తన చుట్టూ జరిగే అన్ని విషయములకు ఆసక్తిరహిత పరిశీలకుడిగా (సాక్షిగా) నిలిచిపోవటం. ఈ శ్లోకంలో ఉన్న ఉపమానము, శ్వేతాశ్వతర ఉపనిషత్తు లో కూడా పేర్కొనబడినది:

నవద్వారే పురే దేహీ హంసో లీలాయతే బహి:
వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ (3.18)

"శరీరము తొమ్మిది ద్వారాలను కలిగి ఉంటుంది - రెండు చెవులు, ఒక నోరు, రెండు నాసికారంధ్రాలు, రెండు కళ్ళు, అపానము, జననేంద్రియము. భౌతిక దృక్పథంలో, ఈ దేహంలో ఉండే జీవాత్మ తనను తాను ఈ నవ ద్వార పట్టణం తో అనుసంధానం చేసుకుంటుంది. (తను శరీరమే అనుకుంటుంది). లోకంలోని సమస్త భూతములను నియంత్రించే పరమేశ్వరుడు కూడా, ఈ దేహములో స్థితమై ఉంటాడు. ఎప్పుడైతే జీవాత్మ, భగవంతునితో అనుసంధానం అవుతుందో, ఈ శరీరంలో వసిస్తున్నా, అది ఆయన లాగే స్వేచ్చను పొందుతుంది."

ఈ క్రితం శ్లోకంలో జీవాత్మ దేనికీ కూడా కర్త కాదు, కారణం కాదు అని ప్రకటించాడు, శ్రీ కృష్ణుడు. మరైతే, ఈ లోకంలో అన్ని కర్మలకు భగవంతుడే కారణమా?
కాదు ఇదంతా ప్రకృతి నియమం ప్రకారం జరుగుతుంది. ఎవరైతే ప్రకృతి మాయలో ఉంటారో వారు భద్దులు అవుతారు.

సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ ।
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ।। 13 ।।

WHO R U

*నీవు ఎవరు*

*64 లక్షల జీవకణాలు* అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..
అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది.
ఈ దేహం నేనే అంటాం.
కానీ ఎలా?
నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?
ఏ భాగము వినదు.
వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.
చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది.
అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.
ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?
ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆదేవుడిచ్చిన పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.
ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో.
రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.
రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.
చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.
ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం ఔతాయి.
రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.
ఈ దేహం దేవుడిచ్చిన ఒ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈ దేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.
కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్.

Sunday, June 28, 2020

SHANKHAM శంఖం

శంఖం

భారతీయ సంస్కృతిలో 'శంఖం'కు ప్రత్యేక స్థానం ఉంది. అఖండ దైవిక వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలం అనే అర్థం. క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒక్కటిగా పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మధన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి.

ఆధ్యాత్మికంగా శంఖం 
శంఖం ఆధ్యాత్మికంగా చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందింది. దక్షిణావర్త శంఖం ఎంతో శ్రేష్ఠమైంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అదే విధంగా అర్జునుడి శంఖాన్ని దేవదత్తంగానూ, భీముని శంఖం పౌండ్రకం అనీ, యుధిష్ఠరుని శంఖాన్ని అనంత విజయమనీ, నకులుని శంఖాన్ని సుఘోషనామంతో, సహదేవుని శంఖాన్ని మణిపుష్ప అన్న పేర్లతో పిలుస్తారని మహాభారతకథ చెబుతుంది. వైరివర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖాన్ని పూరించడమన్నది యుద్ధ నియమాలలో ఒకటి. విజయ సూచికంగా కూడా శంఖాన్ని పూరించడమన్నది ఓ ఆచారం.  

లక్ష్మీ, శంఖం సముద్ర తనయలని విష్ణుపురాణం చెబుతోంది. వరుణుడు, చంద్రుడు, సూర్యుడు శంఖం యొక్క పీఠభాగంలోనూ, ప్రజాపతి ఉపరితలం మీద, గంగా సరస్వతులు ముందు భాగంలో ఉంటారు. విష్ణు మూర్తి దుష్ట శక్తులను పారద్రోలడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది.

నిజానికి శంఖం జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు. శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు అనే నానుడి మనకు తెలిసినదే. నవ నిధులు, అష్టసిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు. ఫూజా, ఆరాధన, యఙ్ఞాలు, తాంత్రిక క్రియలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక, ధార్మిక ఉత్సవాలు, యఙ్ఞాలు, శివరాత్రి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు. శంఖాన్ని పూజించడంతో పాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు. శంఖాన్ని పూజిస్తారు. 

శంఖాలలో వివిధ రకాలున్నాయి. దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం, మధ్యమావర్త శంఖంగా చెప్తారు. వీటిలోనూ లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు ఉన్నాయి. భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలను, విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

పూజ గదిలో దక్షిణావర్త శంఖం 
సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్య్రం వదిలిపోతుంది. అదే విధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి. 

ఫలితాలు
శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది. శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది. మెదడు చురుకుతనం వృద్ధి చెందుతుంది. ఊపిరితిత్తు పనితీరు, శ్వాసక్రియ బాగుంటుంది. శంఖం ఊదడం వల్ల గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి. 

దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగకారకాలైన క్రిములు నశిస్తాయి. శంఖారావం వల్ల మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు. అందువలనే శంఖాన్ని పూరించడం వల్ల గాని, ఆ ధ్వనిని వినడంవలన గాని ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతాయంటారు.

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపులలో చేరాలి అనుకునే వారు, ఈ క్రింది లింకుల మీద క్లిక్ చెయ్యండి

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపులలో చేరాలి అనుకునే వారు, ఈ క్రింది లింకుల మీద క్లిక్ చెయ్యండి

1. https://chat.whatsapp.com/B8Czi4F8kM66LSUcRpAe2o

2. 
https://chat.whatsapp.com/BiqhcyUX6H89wFCWm5liRd

3. https://chat.whatsapp.com/COiZjiWEAdHAfynhMUvjSI

4. https://chat.whatsapp.com/Io0im5zVx4f2TstTq0NIYj

5. https://chat.whatsapp.com/L6pzTybEdztLjTWRY5w4iP

6. https://chat.whatsapp.com/Ctw7H85PFTB77uwKKFnkCl

7. https://chat.whatsapp.com/FTAD8XapQUZACedJnxaTZG

టెలిగ్రామ్: http://t.me/joinchat/AAAAAFjgsZ5e6KQX9WtkhQ

పై సమూహాలలో ఖాళీలు లేకపోతే 99127 31349 కి వాట్సాప్ లో సందేశం పంపగలరు. మీకు వివరాలు పంపబడతాయి

దయచేసి ఈ సందేశాన్ని మీకు తెలిసిన అన్ని వాట్సాప్, ఫేస్బుక్ తదితర సమూహాలకు పంపగలరు. సమూహంలో వీలైనంత మందిని చేర్చి, ధర్మ ప్రచారంలో మీరు కూడా భాగం కండి

ఇట్లు 

సమూహ నిర్వాహకులు

SHADHANACHATHUSTAYA SAMPATHI

 సాధనాచతుష్టయ సంపత్తి

🌹 శమము 🌹


✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ 

దమము  అంటే బాహ్యేంద్రియ నిగ్రహము (ఇంద్రియములు మరియు భోగ్య వస్తువులు మధ్య ) -   ఇంద్రియ నిగ్రహము 

 శమము అంటే అంతరెంద్రియ నిగ్రహము (మనస్సుకు ఇంద్రియములకు  మధ్య  )  - మనో  నిగ్రహము  అని చెప్పినప్పటికీ సాధనా పరముగా రెండు కలిపే జరుగుతూ ఉంటాయి.
 
ప్రాపంచిక వస్తు సంపదలు, విషయ సుఖములందు బంధమున్నదని గ్రహించి విముఖత  కలిగి ఉండి మనస్సును ఇంద్రియములతో కూడనివ్వక ఆత్మ లక్ష్యమందు  నిలుపుట  శమము.
 
మనము గాఢముగా ఏదైనా విషయమును గురించి ఆలోచిస్తున్న సమయమున మన ముందు జరిగిన సంఘటనలను కుడా మనము గుర్తించలేము. అంటే మనస్సు ఇంద్రియములతో జోడిస్తేనే విషయములను గ్రహించాగలుగుతాము.  

కనుక ఇంద్రియ నిగ్రహ సాధనల వలన మనో నిగ్రహము బలపడితే  మనో నిగ్రహ  సాధనల వలన ఇంద్రియములు సులువుగా స్వాధీనమవుతాయి.
 
మనస్సు ఎందుకు బహిర్ముఖము అవుతుంది?
- విషయ సుఖములందు  ఆసక్తి వలన
- విషయ సుఖములకు కావలసిన వస్తు సంపదలను ప్రోగుచేసుకోవలననే  కోరిక వలన విషయాసక్తి

- విషయ వైరాగ్యము వలన, వస్తువుల కున్న పరిమితులు  గుర్తించుట వలన
- వస్తు సంపదలు, విషయ సుఖములందు ఉన్న బంధము, దోషములను గుర్తించుట వలన    తొలగుతుంది.
 
మనస్సు ఎందుకు అలజడికి లోనవుతుంది?
- జగత్తులో వ్యవహార సమయమున ప్రతిఫలము పట్ల  ఆసక్తి కలిగి ఉండుట వలన
- జీవితములో జరుగుచున్న సంఘటనలను అంగీకరించలేక  పోవుట వలనను
 
ఇవి  
- దైవీసమర్పణ  భావనతో, ప్రతిఫలాపేక్ష రహిత కర్మ చేయుట వలన
- ఈశ్వర నియతిని (కర్మను) అంగీకరించుట వలనను  తొలగుతాయి.
 
ఎప్పుడైతే మనస్సు బహిర్ముఖము కాక, అలజడికి లోనుకాక  శాంతముగా ఉంటుందో  అటువంటి మనస్సు ఆత్మ జ్ఞాన విచారణకు, తనను తానూ తెలుసుకొనే దిశగా ప్రాయాణించుటకు అనుకూలముగా ఉంటుంది.
 
ఈ విధముగా మనస్సును శమింప చేయుటను శమము అంటారు.
 
ప్రాణాయామము, జపము,  ఉపాసన మొదలగునవి శమమును పెంపొందించుకొనుటకు ఉపయోగ పడు సాధనలు.
🌹 🌹 🌹 🌹 🌹

DAILY FACTS

నిత్య సత్యాలు



🍂మూసి ఉన్న గుప్పిటి , మూసి ఉన్న మనస్సు యితరులకు
మంచి చేయలేవు . యితరులనుండి మంచిని స్వీకరించలేవు .

 🍂" నేను - నాది " అనే స్థితి నుండి "మనము - మనది " అనే
మహోన్నత స్థాయికి ఎదగాలి నేటి మానవాళి .

 🍂ప్రోత్సాహం కోసం ఎదురు చూడకుండా ఉత్సాహం తో మంచిపనులు చేస్తూ ముందుకు పోవాలి .

 🍂సంక్రమించిన ధనం తో సంతోషాన్ని పొందగలము . కానీస్వయము కృషి తో సంపాదించిన ధనం తో ఆత్మ సంతృప్తిపొందగలము

 🍂కలసి మెలసి జీవించడం బలం . ఒకరినొకరు కలబడటం
బలహీనం .

 🍂తాళంచెవి లేని తాళాలు ఉండవు . పరిస్కారం లేని
సమస్యలు ఉండవు .

 🍂మెల్లగా నడిచినా పర్వాలేదు .అడుగులు లక్యం వైపు ఉంటె గమ్యాన్ని తప్పక చేరుకోగలం .

 🍂అసత్యం తో సాధించిన విజయం కంటే , సత్య మార్గం లో నడచి పొందిన ఓటమి గొప్పది .

🍂 నేను - నాది , నువ్వు - నీది అనే ఈ నాలుగు పదాలు
అనేక సమస్యలకు మూల కారణాలు

🍂 లేనివారికి ఆకలి భాధ , ఉన్నవారికి యింకా కావాలనే
బాధ . నిజానికి యిద్దరివి బాధలే .

 🍂ధనాన్ని సంపాదించడం యెంత కష్టమో , దానిని
రక్షించుకోవడం కూడా అంటే కష్టము .

 🍂గొప్పవారైనా మరణించక తప్పదు . కానీ గొప్పదనానికి
మరణం ఉండదు .

 🍂క్షమా గుణం చేతకానితనం కాదు . క్షమించాలంటే
కొండంత మనో బలం ఉండాలి .

 🍂మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం , మనకు
మనమే మిత్రులం . మనకు సమానమే శత్రువులం .

 🍂మన సమస్యలకు , దుఃఖాలకు మనమే కారణం
యితరులు కారణం అనుట దారుణం .

 🍂యితరులను జయించటానికి ప్రయత్నిమ్చుట కంటే
నిన్ను నీవు జయించటానికి ప్రయత్నిమ్చు .

 🍂మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమే కాదు ,
మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి .

 🍂జ్ఞానాన్ని తెలుసుకోవడం యెంత ముక్ష్యమో , తెలుసుకొన్న
జ్ఞానాన్ని జీవితం లో ఆచరించడం అంతకంటే ముఖ్యం .

 🍂ధనం పరుల పాలు - కుటుంబ సభ్యులు , బంధువులు
స్నేహితులు స్మశానం వరకు - శారీరం చితి పైకి - నీ
కర్మ ఫలితం మాత్రమే నీ వెంట వస్తుంది .

 🍂కర్మలను విత్తనాలతో పోల్చవచ్చును . ఏ విత్తనము వేస్తె ఆ ఫలమునే పొందుతాము . అలాగే నీవు చేసే కర్మలు
ఎటువంటివో అటువంటి ప్రారబ్దాన్ని పొందుతావు .

 🍂ఒక రోజు పూర్తి అయింది అంటే , ఆయుస్సు లో ఒక రోజుతగ్గిందని అర్ధము . అందువలన సత్కర్మలు యెంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది

https://drive.google.com/file/d/1NALADe6F7q0ft_yjVki-8isZkvnbGopM/view?usp=drivesdk

నేను యోగనిద్ర లింకు పెట్టాను చాల మంది open కాలేదు అని message  పెట్టారు.

మీకోసం ప్రత్యేకంగా లింకు చేయించి పెట్టాను. ఇప్పుడు తప్పనిసరిగా open అవుతుంది. 

ఎందుకు పంపిస్తున్నానంటే డాక్టర్ మాణికేశ్వరరావు గారు ఎంతో కష్టపడి యోగ నిద్ర ఆడియో చేశారు.

మీరు పడుకొని కళ్ళు మూసుకొని వింటూ ఉంటే ప్రపంచాన్ని  మరచిపోతారు.
మీ బాధలు కష్టాలు టెన్షన్ అన్ని మరచిపోయి ఆనందిస్తారు 
 అంత అద్భుతంగా ఉంటుంది 

ఇది నా స్వానుభవం 


I AM QUALIFIED QUALIFIED THE QUALITY COUNCIL OF INDIA

MORNING AFFIRMATIONS

 

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA & FITNESS CLASSES AT YOUR DOOR STEPS

My photo
Vijayawada, andhrapradesh, India
I AM YOGA TEACHER

Goolgepay Phone pay Paytm

Donate for our yoga center paytm : 8977277742
YOGA  personal & online yoga training availability anywhere the world

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA &FITNESS CLASSES AT YOUR DOOR STEPS FROM THE POINT OF INDIAN TRADITIONAL YOGA FOCUSED AREA: GENERAL FITNESS & OBESITY(OVERWEIGHT REDUCTION) TRAINING CLASSES AT THE STUDIO COVERING ALL HEALTH PROBLEMS SPECIALIZATION : PRANAYAMA | PRANIC HEALING | MEDITATIVE