https://hostinger.in?REFERRALCODE=I60SHAKTHNQD

https://hostinger.in?REFERRALCODE=I60SHAKTHNQD
https://hostinger.in?REFERRALCODE=I60SHAKTHNQD

YOGA ASANAS 1

YOGA HEALTH

Sunday, October 16, 2022

మిర్రర్ ని మంత్ర

 మిర్రర్ ని చూస్తూ మంత్ర జపం చేయడం, దాని ముందు కూర్చుని అలాగే ధ్యానం చేయడం, ఇలా కొంత కాలం (మొదట్లో) చేస్తూ ఉండగా, నాకు అద్దంలో రకరకాల రంగులు, ఆకారాలు, కొన్ని సంఘటనలు వరుస క్రమంలో, కొన్ని సార్లు పూర్తి స్థాయిలో..... ఆ సంఘటన లో నేనే ఉన్నాను, అనేంత గాఢమైన స్థితిలో!! ఇంకా కొన్ని సార్లు spirits కనబడేవి. సాధన మొదటి దశలో ఉండగా కనిపించే రంగులు స్పష్టం గా ఉండేది కాదు!! మిర్రర్ ముందు కూర్చుని చూడగానే మిర్రర్ కి బదులుగా ఓ పెద్ద కాంతి వలయం గానీ పూర్తిగా ఓ ఆకారం కానీ కనబడేది. దానినే చూస్తూ ఉంటే దానికి సంబంధించిన మరో విషయం కనిపించేది!! అయితే ఈ రంగుల విషయంలో నేను చాలా కన్ఫ్యూజన్ అయ్యే వాడిని. ఎందుకు అంటే నాకు కనిపించిన రంగులు ఇంత వరకు సాధారణ నేత్రాలకు కనిపించవు. అవి. వాటికి ఏ పేరుతో పిలవాలో లేక పిలుస్తారో కూడా తెలియదు. మనకు తెలిసిన భాషలు ఆ రంగులకు పేర్లింకా పెట్టలేదు. ఈ ఆరా (Aura) గురించిన కొన్ని పుస్తకాలు కూడా చదివాను. కానీ వాటి ద్వారా నాకు పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ పుస్తకాల్లో వివరించే రంగుల గురించి నేను చూసే రంగులకు పెద్ద వ్యత్యాసం ఉంది. ఆ పుస్తకంలో కోపం వస్తే ఓ రంగంలో, కామపూరితమైన ఆలోచనలు వస్తే మరో రంగు, ప్రేమ ఉన్న వ్యక్తి ఆరా ఇంకో రంగును కలిగి ఉంటారు అని సూచించారు. కానీ నేను నా మీద నేను కొన్ని ప్రయోగాలు చేసి చూశాను. అద్దం ముందు కూర్చుని ఒకరి మీద కోపం తెచ్చుకుని చూస్తే ఎరుపు రంగు బదులు మరో రెండు రంగులు మిళితం అయి కనిపించడం జరిగింది. అలాగే ఫోన్ లో డివోషనల్ పాటలు వింటూ చూడగా మరో రంగు. బాగా వ్యాయామం చేసి చూడగా మరో మూడు రంగులు మిళితమై శక్తిని స్వీకరిస్తున్నట్లు! నిద్ర లేవగానే చూస్తే నా ప్రాణమయ కోశం కొత్త శక్తి కలిగి తేజోవంతంగా చూశాను. అలాగే ఫ్రిజ్ లో పెట్టి మూడు రోజుల పాటు ఉంచిన కూరగాయలను తీసి చూస్తే వాటి చుట్టూ ఓ విధమైన స్పటికం రూపంలో, లైట్ స్పార్క్ కనబడింది. ఇలా కొన్ని రోజులుగా చేస్తూ ఉండగా నాకు ఈ occult science కి సంబంధించిన పుస్తకాలు చదవడం మీద ఆసక్తి పోయింది. కారణం ఏమిటి? అంటే, ఇలాంటి సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలను పూర్తిగా వివరించలేకపోవడం.... ఒకటైతే ,

రెండో విషయం ఏమిటంటే..... వీటి గురించిన దర్శనాలు, అనుభవాలు, అన్ని కూడా వారి వారి అంతర్గత అభివృద్దిని బట్టి, కారణ శరీరం యొక్క అభివృద్దిని బట్టి, వారు చూసే దృష్టి కోణం బట్టి ఉంటుంది అని గ్రహించాను. ఈ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన విషయాలను ఓ పట్టాన ఇది ఇది అని ఇంటర్ప్రిట్ చేయడం కష్టం. ఇలా చేస్తూ ఉండగా నా తల మీద కొన్ని అంగుళాల ఎత్తు లో నాకు ఓ రోజు కొత్త రంగు కనిపించడం జరిగింది ఆరా కంటే కూడా కొంత తేజోవంతంగా, వేగంగా మారుతున్న రంగు అది. తర్వాత నేను ఆలోచించే ఆలోచనలు కూడా నాకు చిత్ర రూపంలో కనిపించడం.....
ఇలా ఒక రోజు నేను మా శ్రీనివాస్ మిత్రుడు ఇద్దరం కలిసి సినిమా కి వెళ్ళాం. కొంత సేపు చూస్తూ ఉండగా, ఆ సినిమా లో నటించిన నటీనటుల ఆరాలు కనిపించడం చూశాను. ఈ దృశ్యం చాలా వింతగా ఉంది నాకు మొదటి సారిగా చూడటం ఇలా. కొన్ని సార్లు ఆ షూటింగ్ టైంలొ వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అప్పుడు చూశాను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఓ అలవాటుగా అయింది. రెండు సార్లు సినిమా చూస్తాను, ఒక సారి సినిమా ఎంజాయ్ చేయడానికి ఇంకో సారి వారి ఆరా చూడటానికి. తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చి ఇద్దరం టీ తాగడం కోసం బస్ స్టాండ్ కి వెళ్ళాం. ఆ బస్ స్టాండ్ లో ఉన్న వ్యక్తుల ఆరాలు మరో వింతైన రంగు ఉండటం చూశాను.
. నేను చూసింది ఆ పూర్తి బస్ స్టాండ్ యొక్క ఆరా ని!! ఖమ్మం నుండి వచ్చిన హైదరాబాద్ బస్సు అపుడే వచ్చింది. దాని యొక్క ఆరా భలేగా ఉంది. గొంగళి పురుగు పై ఉండే జుట్టు లాగా ఉంది ఈ బస్సు యొక్క ఆరా. మనకు తెలిసిన ఏడు రంగులు కాకుండా ఇతర రంగులు చాలా రకాలు ఉన్నాయి. ఈ రంగులు. ఇలా చూడటం నాకు అదే ఓ పనిగా పెట్టుకున్నాను. రోడ్డు మీద ఉన్న ఓ షాప్ వద్ద నిలబడి టీ తాగుతూ వచ్చి పోయే వాహనాల ఆరాలను చూడటం. ఒక చెట్టు వద్దకు వెళ్ళి దాన్ని చూస్తూ ఉండటం. తెల్లవారు జామున నిద్ర లేచి సూర్యోదయం అయే సమయం లో అనేక ప్రదేశాల యొక్క ఆరాలు చూడటానికి మన రెండు కళ్లు సరిపోవు. అలాగే శ్మశానం కి వెళ్ళి అక్కడ ఉండే కొన్ని రకాల స్పిరిట్స్ ని కూడా చూశాను. ఇలా చాలా చాలా అనుభవాలు!! ఈ ఫలితం వెనక శ్రద్ధ, దీక్ష, ఓర్పు ఉన్నాయి. నేను ఇదివరకు మా కొత్తగూడెం లో ఉన్న మా ధ్యాన కేంద్రానికి ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు అక్కడే ఉండి ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, ధ్యాన మిత్రులతో కలసి ఈ విషయాలపై విశేషంగా చర్చించడం. నా క్లాస్ పుస్తకాలు చదవడం చేసేవాడిని. రాత్రి అంతా ధ్యానం చేయడం, జపం చేయడం ఇదే నా పని అయిపోయింది. దసరా సెలవులు రావడంతో భోజనం చేయకుండా కేవలం ధ్యానం, జపం చేస్తూ ఉండగా, అలిసి పోయి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని పడుకుని ఉండగా ఓ ఇద్దరు అమ్మాయిలు నా పాదాల వద్ద నిలబడి బయటకు రా, బయటకు రా..... అని పిలిచారు. వెను వెంటనే నా శరీరం నుంచి నేను పూర్తి స్పృహతో బయటకు రావడం, తర్వాత మూడో వ్యక్తి ( మగమనిషి) పేరు అప్రస్తుతం!! నాకు ఓ పుస్తకాన్ని తెరిచి చూపిస్తూ..... ఇదిగో, ఇది నీ శరీరం, ఇందులో ఇవి ఊపిరి తిత్తులు, ఇవి మూత్ర పిండాలు ఇలా ఒక్కో అవయవాల గురించి చాలా విషయాలు వివరంగా చెబుతూ..... ప్రాణామయకోశం ఇది, ఈ రంగులో ఉంది చూశావా? మనోమయ కోశం ఇది, దీని రంగు ఇలా ఉంది..... ఇలా చూపించి తిరిగి నా శరీరం లోకి వచ్చాక ఒక్క విషయం కూడా సరిగ్గా గుర్తు రాకుండా పోయింది. కొంత సమయం పాటు. ఒక రోజు ఒక వ్యక్తి ధ్యాన మందిరం లో ధ్యానం చేస్తుంటే, ఈయన ఆరా ఎలా ఉంటుందో చూద్దాం..... అని చూస్తూ ఉండగా ఆ మందిరం పై నుంచి అత్యంత స్పష్టమైన గొంతు వినబడింది. ధ్యానం చేస్తూ ఉంటే, వారి యొక్క ఆరాను చూడటం తప్పు అని!! ఆ తర్వాత ఫేయిరీస్ కోసం ఈ మిర్రర్ సహాయం తో చెట్లపై చాల ప్రయోగాలు చేస్తూ ఉంటే ఓ రోజు వర్షం కురుస్తోంది. వాతావరణం చల్లగా ఉందని, ఆ వర్షంలో తడుస్తూ ధ్యానం చేయడానికి, ఓ వేప చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెడితే, ఓ పెద్ద మనిషి పూర్తి శరీరం అంతా ఎరుపు రంగులో ఉండి దుస్తులు లేకుండా సడెన్ గా కనబడటం గమనించి, ఉన్న ఫణంగా పరుగులు తీసి, కాళ్ళకు దెబ్బలు తగిలించుకున్నాను.
అద్దంతో సాధనలు ప్రారంభించి, అప్పటికే ఆరు నెలలు అయింది 1998 లో మిర్రర్ ముందు కూర్చుని చూడగానే, మిర్రర్ కనిపించేది కాదు. ఆ మిర్రర్ ఉన్న ప్లేస్ లో ఓ పెద్ద నీలి రంగు కలిగిన కాంతి గోళం కనిపించేది. దాన్ని చూస్తూ గురువు గారు ఇచ్చిన మంత్రం జపించే వాడిని. తర్వాత కాసేపట్లో ఆ నీలి రంగు గోళం నుంచి ఎన్నో రకాల అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, etc., etc., చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండేది, వాటిని చూస్తూ ఉంటే ఆయా ప్రాంతాల్లో మనం ఉన్నట్లు ఉంటుంది ఆ అనుభూతి. నా ఆరా, నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది . హాలో చూడగలిగాను. ఎదుటి వారి ఆరోగ్యం, మనసులో ఉన్న భావాలను, చిత్ర రూపంలో చూడగలిగాను. మా మామయ్య డాక్టర్ వినయ్ కుమార్ ఈ విషయం పై చాలా సంవత్సరాల క్రితం పుస్తకాలు రాశారు!! పూర్వజన్మలు - పరలోకాలు, మీడియం షిప్, శ్రీబైద్యనాథోపనిషత్, పంచ యజ్ఞాలు, లార్డ్ రివీల్స్ - ట్రూత్ స్ర్టేంజర్ దాన్ ఫిక్షన్, మొదలైన చాలా పుస్తకాలు రాశారు, ఈ మిర్రర్ సాధన గురించి మొదట పరిచయం చేసింది మామయ్య గారే, ఈ సాధనకు సంబంధిత మంత్రం తో ఎన్నో వేలు జపం చేసేవాడిని. మిర్రర్ ముందు కూర్చుని. రాత్రి వేళల్లో మిర్రర్ ముందు కూర్చుని జపం చేస్తూ నిద్ర వస్తే అలాగే నిద్రించేవాడిని. దీని వల్ల సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన కొందరు మహానుభావులు పరిచయం అయ్యారు!! సూక్ష్మ శరీరము తో పూర్తి ఎరుకతో చేయగలమని అర్థం అయింది. మా కసిన్ బ్రదర్ ఉమేష్, లండన్ లో పారాసైకాలజీ లో PhD చేశారు చాలా బిజీగా ఉండే మా అన్నయ్య లండన్ నుంచి చాలా పుస్తకాలు occult science and metaphysics మరియు తాంత్ర సంబంధిత పుస్తకాలు, డాక్యుమెంట్లు పంపేవాడు. ఆ పుస్తకాలు నా సాధనకు, అధ్యయనానికి, గురువు గారి వద్ద సందేహ నివృత్తి కి మంచి అవకాశం లభించడం జరిగింది.
ఈ సాధన వల్ల థియోసఫికల్ సొసైటీలో, కీలక పాత్ర వహించిన తల్లాప్రగడ. సుబ్బారావు గారిని నా కళ్లారా చూడటం జరిగింది.
మిర్రర్ ని చూస్తూ జపం చేయడం, దాని ముందు కూర్చుని అలాగే ధ్యానం చేయడం, ఇలా కొంత కాలం (మొదట్లో) చేస్తూ ఉండగా, నాకు అద్దంలో రకరకాల రంగులు, ఆకారాలు, కొన్ని సంఘటనలు వరుస క్రమంలో, కొన్ని సార్లు పూర్తి స్థాయిలో..... ఆ సంఘటన లో నేనే ఉన్నాను అనేంత గాఢమైన స్థితిలో!! ఇంకా కొన్ని సార్లు spirits కనబడేవి. సాధన మొదటి దశలో ఉండగా కనిపించే రంగులు స్పష్టం గా ఉండేది కాదు!! మిర్రర్ ముందు కూర్చుని చూడగానే మిర్రర్ కి బదులుగా ఓ పెద్ద కాంతి వలయం గానీ పూర్తిగా ఓ ఆకారం కానీ కనబడేది. దానినే చూస్తూ ఉంటే దానికి సంబంధించిన మరో విషయం కనిపించేది!! అయితే ఈ రంగుల విషయంలో నేను చాలా కన్ఫ్యూజన్ అయ్యే వాడిని. ఎందుకు అంటే నాకు కనిపించిన రంగులు ఇంత వరకు సాధారణ నేత్రాలకు కనిపించవు. అవి. వాటికి ఏ పేరుతో పిలవాలో లేక పిలుస్తారో కూడా తెలియదు. మనకు తెలిసిన భాషలు ఆ రంగులకు పేర్లింకా పెట్టలేదు. ఈ ఆరా (Aura) గురించిన కొన్ని పుస్తకాలు కూడా చదివాను. కానీ వాటి ద్వారా నాకు పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ పుస్తకాల్లో వివరించే రంగుల గురించి నేను చూసే రంగులకు పెద్ద వ్యత్యాసం ఉంది. ఆ పుస్తకంలో కోపం వస్తే ఓ రంగంలో, కామపూరితమైన ఆలోచనలు వస్తే మరో రంగు, ప్రేమ ఉన్న వ్యక్తి ఆరా ఇంకో రంగును కలిగి ఉంటారు అని సూచించారు. కానీ నేను నా మీద నేను కొన్ని ప్రయోగాలు చేసి చూశాను. అద్దం ముందు కూర్చుని ఒకరి మీద కోపం తెచ్చుకుని చూస్తే ఎరుపు రంగు బదులు మరో రెండు రంగులు మిళితం అయి కనిపించడం జరిగింది. అలాగే ఫోన్ లో డివోషనల్ పాటలు వింటూ చూడగా మరో రంగు. భాగా వ్యాయామం చేసి చూడగా మరో మూడు రంగులు మిళితమై శక్తిని స్వీకరిస్తున్నట్లు! నిద్ర లేవగానే చూస్తే నా ప్రాణామయ కోశం కొత్త శక్తి కలిగి తేజోవంతంగా చూశాను. అలాగే ఫ్రిజ్ లో పెట్టి మూడు రోజుల పాటు ఉంచిన కూరగాయలను తీసి చూస్తే వాటి చుట్టూ ఓ విధమైన స్పటికం రూపంలో, లైట్ స్పార్క్ కనబడింది. ఇలా కొన్ని రోజులుగా చేస్తూ ఉండగా నాకు ఈ occult science కి సంబంధించిన పుస్తకాలు చదవడం మీద ఆసక్తి పోయింది. కారణం ఏమిటి? అంటే, ఇలాంటి సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలను పూర్తిగా వివరించలేకపోవడం.... ఒకటైతే రెండో విషయం ఏమిటంటే వీటి గురించిన దర్శనాలు, అనుభవాలు, అన్ని కూడా వారి వారి అంతర్గత అభివృద్దిని బట్టి, కారణ శరీరం యొక్క అభివృద్దిని బట్టి, వారు చూసే దృష్టి కోణం బట్టి ఉంటుంది అని గ్రహించాను. ఈ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన విషయాలను ఓ పట్టాన ఇది ఇది అని ఇంటర్ప్రిట్ చేయడం కష్టం. ఇలా చేస్తూ ఉండగా నా తల మీద కొన్ని అంగుళాల ఎత్తు లో నాకు ఓ రోజు కొత్త రంగు కనిపించడం జరిగింది ఆరా కంటే కూడా కొంత తేజోవంతంగా, వేగంగా మారుతున్న రంగు అది. తర్వాత నేను ఆలోచించే ఆలోచనలు కూడా నాకు చిత్ర రూపంలో కనిపించడం.....
ఇలా ఒక రోజు నేను మా శ్రీనివాస్ మిత్రుడు ఇద్దరం కలిసి సినిమా కి వెళ్ళాం. కొంత సేపు చూస్తూ ఉండగా, ఆ సినిమా లో నటించిన నటీనటుల ఆరాలు కనిపించడం చూశాను. ఈ దృశ్యం చాలా వింతగా ఉంది నాకు మొదటి సారిగా చూడటం ఇలా. కొన్ని సార్లు ఆ షూటింగ్ టైంలొ వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అప్పుడు చూశాను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఓ అలవాటుగా అయింది. రెండు సార్లు సినిమా చూస్తాను, ఒక సారి సినిమా ఎంజాయ్ చేయడానికి ఇంకో సారి వారి ఆరా చూడటానికి. తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చి ఇద్దరం టీ తాగడం కోసం బస్ స్టాండ్ కి వెళ్ళాం. ఆ బస్ స్టాండ్ లో ఉన్న వ్యక్తుల ఆరాలు మరో వింతైన రంగు ఉండటం చూశాను.
. నేను చూసింది ఆ పూర్తి బస్ స్టాండ్ యొక్క ఆరా ని!! ఖమ్మం నుండి వచ్చిన హైదరాబాద్ బస్సు అపుడే వచ్చింది. దాని యొక్క ఆరా భలేగా ఉంది. గొంగళి పురుగు పై ఉండే జుట్టు లాగా ఉంది ఈ బస్సు యొక్క ఆరా. మనకు తెలిసిన ఏడు రంగులు కాకుండా ఇతర రంగులు చాలా రకాలు ఉన్నాయి. ఈ రంగులు. ఇలా చూడటం నాకు అదే ఓ పనిగా పెట్టుకున్నాను. రోడ్డు మీద ఉన్న ఓ షాప్ వద్ద నిలబడి టీ తాగుతూ వచ్చి పోయే వాహనాల ఆరాలను చూడటం. ఒక చెట్టు వద్దకు వెళ్ళి దాన్ని చూస్తూ ఉండటం. తెల్లవారు జామున నిద్ర లేచి సూర్యోదయం అయే సమయం లో అనేక ప్రదేశాల యొక్క ఆరాలు చూడటానికి మన రెండు కళ్లు సరిపోవు. అలాగే శ్మశానం కి వెళ్ళి అక్కడ ఉండే కొన్ని రకాల స్పిరిట్స్ ని కూడా చూశాను. ఇలా చాలా చాలా అనుభవాలు!! ఈ ఫలితం వెనక శ్రద్ధ, దీక్ష, ఓర్పు ఉన్నాయి. నేను ఇదివరకు మా టిబెట్ లో ఉన్న మా ధ్యాన కేంద్రానికి ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు అక్కడే ఉండి ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, ధ్యాన మిత్రులతో కలసి ఈ విషయాలపై విశేషంగా చర్చించడం. నా క్లాస్ పుస్తకాలు చదవడం చేసేవాడిని. రాత్రి అంతా ధ్యానం చేయడం, జపం చేయడం ఇదే నా పని అయిపోయింది. దసరా సెలవులు రావడంతో భోజనం చేయకుండా కేవలం ధ్యానం, జపం చేస్తూ ఉండగా, అలిసి పోయి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని పడుకుని ఉండగా ఓ ఇద్దరు అమ్మాయిలు నా పాదాల వద్ద నిలబడి బయటకు రా, బయటకు రా..... అని పిలిచారు. వెను వెంటనే నా శరీరం నుంచి నేను పూర్తి స్పృహతో బయటకు రావడం, తర్వాత మూడో వ్యక్తి ( మగమనిషి) పేరు అప్రస్తుతం!! నాకు ఓ పుస్తకాన్ని తెరిచి చూపిస్తూ..... ఇదిగో, ఇది నీ శరీరం, ఇందులో ఇవి ఊపిరి తిత్తులు, ఇవి మూత్ర పిండాలు ఇలా ఒక్కో అవయవాల గురించి చాలా విషయాలు వివరంగా చెబుతూ..... ప్రాణామయకోశం ఇది, ఈ రంగులో ఉంది చూశావా? మనోమయ కోశం ఇది, దీని రంగు ఇలా ఉంది..... ఇలా చూపించి తిరిగి నా శరీరం లోకి వచ్చాక ఒక్క విషయం కూడా సరిగ్గా గుర్తు రాకుండా పోయింది. కొంత సమయం పాటు. ఒక రోజు ఒక వ్యక్తి ధ్యాన మందిరం లో ధ్యానం చేస్తుంటే, ఈయన ఆరా ఎలా ఉంటుందో చూద్దాం..... అని చూస్తూ ఉండగా ఆ మందిరం పై నుంచి అత్యంత స్పష్టమైన గొంతు వినబడింది. ధ్యానం చేస్తూ ఉంటే, వారి యొక్క ఆరాను చూడటం తప్పు అని!! ఆ తర్వాత ఫేయిరీస్ కోసం ఈ మిర్రర్ సహాయం తో చెట్లపై చాల ప్రయోగాలు చేస్తూ ఉంటే ఓ రోజు వర్షం కురుస్తోంది. వాతావరణం చల్లగా ఉందని, ఆ వర్షంలో తడుస్తూ ధ్యానం చేయడానికి, ఓ వేప చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెడితే, ఓ పెద్ద మనిషి పూర్తి శరీరం అంతా ఎరుపు రంగులో ఉండి దుస్తులు లేకుండా సడెన్ గా కనబడటం గమనించి, ఉన్న ఫణంగా పరుగులు తీసి, కాళ్ళకు దెబ్బలు తగిలించుకున్నాను.
మిర్రర్ ని ఓ గంటసేపు చూస్తూ నిద్ర వస్తే అలాగే కూర్చుని నిద్రించాను, కాసేపు!! తర్వాత మళ్ళీ లేచి మిర్రర్ లో చూడగానే మళ్ళీ గాఢమైన నిద్ర మత్తు వచ్చేసింది. ఎంత ప్రయత్నించినా, కళ్ళు తెరిచి చూడలేకపోయాను. కళ్ళు మూత పడ్డాయి కానీ, నాకు మిర్రర్ కనిపిస్తోంది!! ఆ మిర్రర్ ఇంకో రకంగా ఉంది! ఆ మిర్రర్ ముందు ఓ తెల్లని కాంతి ఆవరించి ఉంది!! దాన్ని అలాగే చూస్తూ ఉన్నాను!! కాసేపు అయిన తర్వాత నాలో ఏం జరిగిందో అర్థం కాలేదు, కానీ నేను ఓ అరణ్యంలో జలపాతం వద్ద ఉన్న ఓ రాతి బండ పై నిద్ర లేచాను!! ఎత్తైన కొండలు గుట్టలు, దట్టమైన అడవి, పచ్చని ప్రకృతి, అద్భుతమైన చల్లని గాలి!! వాతావరణం అద్భుతంగా ఉంది..... కొండ పై నుంచి జలపాతం!! చూడటానికి రెండు కళ్లు సరిపోవు!! ఆ అద్భుతాన్ని నా శరీరం అంతా అణువణువు అనుభూతి చెందుతోంది. పూర్తి నిశబ్దం!! నీటి తుంపరలు నా మీద పడటం వల్ల ఆ చల్లదనానికి నిద్ర లేచాను!! నేను నిలబడి ఉన్న ఫ్లేస్ కి కొంత దూరంలో ఓ చిన్న దారి కనబడింది. దాని గుండా నడిచి వెళ్ళాను. కొంత దూరం లో ఓ పెద్ద ఆలయం ఉంది!! ఏదో ఉత్సవం జరుగుతోంది!! ఆలయాన్ని చూస్తే ఈ భూమి మీద అలాంటి ఆలయం ఎక్కడా కూడా ఉండదు. అంత పెద్దది, చాలా అద్భుతంగా, సౌందర్య భరితంగా.... నయన మనోహరమైన ఆ ఆలయాన్ని చూస్తే, అక్కడే ఉండిపోయి ధ్యానం చేయాలనిపించేంతగా ఉంది. ఆలయం లో నుంచి చాలా చక్కని సంగీతం వినిపిస్తోంది. నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే, అక్కడ ఉన్న స్త్రీ మూర్తి ఒకరు నన్ను నదిలో స్నానం చేసి రండి అని చెప్పగా నేను ప్రక్కనే ఉన్న నదిలో, స్నానం చేయడానికి నదిలోకి దిగాను. వెంటనే నేను నా శరీరం లోకి వచ్చేశాను. దీని గురించి నేను చాలా చెప్పాలని ఉంది, కానీ మాటలు రావడం లేదు. ఈ ఆలయం ఎక్కడ ఉంది? అసలు ఈ భూమి మీదనే ఉందా? లేక మరో తలంలో ఉందా? అని కొన్ని రోజులుగా ఒకటికి రెండుసార్లు అదే విధంగా ధ్యానం చేస్తే చాలా రోజుల తర్వాత సరైన సమాధానం దొరికింది.

Monday, June 29, 2020

NINE HOLES OF THE BODY

సర్వ — సమస్తమైన; కర్మాణి — కర్మలు; మనసా — మనస్సు చే; సన్న్యస్య — త్యజించి; అస్తే — ఉండును; సుఖం — సుఖముగా; వశీ — ఆత్మ నిగ్రహం కలవారు; నవ-ద్వారే — తొమ్మిది మనసా
ద్వారములు కల; పురే — నగరములో; దేహీ — దేహములొఉన్న జీవాత్మ; న — కాదు; ఏవ — నిజముగా; కుర్వన్ — చేయునది; న — కాదు; కారయన్ — కారణము కాదు.

ఆత్మ నిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మలు, తాము దేనికీ కర్త కాదని, దేనికీ కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క తొమ్మిది ద్వారములు కల నగరములో సంతోషంగా ఉంటారు.

భావం:
నవ రంధ్రాలు గల శరీరమును, తొమ్మిది ద్వారాలు గల పట్టణంతో పోల్చుతున్నాడు శ్రీ కృష్ణుడు. జీవాత్మ ఆ పట్టణానికి రాజు, దాని పరిపాలన అంతా అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు మరియు జీవ-శక్తి అనే మంత్రిత్వ శాఖల ద్వారా నడిపింపబడుతాయి. కాలము, మృత్యు రూపంలో, శరీరాన్ని తీసివేసే వరకే, ఈ శరీరంపై రాజ్యపాలన కొనసాగుతుంది. కానీ, పాలన కొనసాగుతున్నప్పుడు కూడా, జ్ఞానోదయమయిన యోగులు తమను తాము శరీరంగా భావించరు, అంతేకాక, తమను తాము ఈ శరీరానికి అధిపతులము అనుకోరు. సరికదా, శరీరమును, దానిచే చేయబడిన అన్ని క్రియలను భగవంతునికే చెందినవని భావిస్తారు. అన్ని కర్మలను మానసికంగా త్యజించి, ఇటువంటి జ్ఞానోదయమైన యోగులు సంతోషంగా ఈ శరీరంలో స్థితులై ఉంటారు. దీనినే, 'సాక్షీ భావము' అంటారు, అంటే, తన చుట్టూ జరిగే అన్ని విషయములకు ఆసక్తిరహిత పరిశీలకుడిగా (సాక్షిగా) నిలిచిపోవటం. ఈ శ్లోకంలో ఉన్న ఉపమానము, శ్వేతాశ్వతర ఉపనిషత్తు లో కూడా పేర్కొనబడినది:

నవద్వారే పురే దేహీ హంసో లీలాయతే బహి:
వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ (3.18)

"శరీరము తొమ్మిది ద్వారాలను కలిగి ఉంటుంది - రెండు చెవులు, ఒక నోరు, రెండు నాసికారంధ్రాలు, రెండు కళ్ళు, అపానము, జననేంద్రియము. భౌతిక దృక్పథంలో, ఈ దేహంలో ఉండే జీవాత్మ తనను తాను ఈ నవ ద్వార పట్టణం తో అనుసంధానం చేసుకుంటుంది. (తను శరీరమే అనుకుంటుంది). లోకంలోని సమస్త భూతములను నియంత్రించే పరమేశ్వరుడు కూడా, ఈ దేహములో స్థితమై ఉంటాడు. ఎప్పుడైతే జీవాత్మ, భగవంతునితో అనుసంధానం అవుతుందో, ఈ శరీరంలో వసిస్తున్నా, అది ఆయన లాగే స్వేచ్చను పొందుతుంది."

ఈ క్రితం శ్లోకంలో జీవాత్మ దేనికీ కూడా కర్త కాదు, కారణం కాదు అని ప్రకటించాడు, శ్రీ కృష్ణుడు. మరైతే, ఈ లోకంలో అన్ని కర్మలకు భగవంతుడే కారణమా?
కాదు ఇదంతా ప్రకృతి నియమం ప్రకారం జరుగుతుంది. ఎవరైతే ప్రకృతి మాయలో ఉంటారో వారు భద్దులు అవుతారు.

సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ ।
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ।। 13 ।।

WHO R U

*నీవు ఎవరు*

*64 లక్షల జీవకణాలు* అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..
అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది.
ఈ దేహం నేనే అంటాం.
కానీ ఎలా?
నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?
ఏ భాగము వినదు.
వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.
చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది.
అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.
ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?
ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆదేవుడిచ్చిన పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.
ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో.
రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.
రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.
చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.
ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం ఔతాయి.
రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.
ఈ దేహం దేవుడిచ్చిన ఒ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈ దేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.
కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్.

Sunday, June 28, 2020

SHANKHAM శంఖం

శంఖం

భారతీయ సంస్కృతిలో 'శంఖం'కు ప్రత్యేక స్థానం ఉంది. అఖండ దైవిక వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలం అనే అర్థం. క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒక్కటిగా పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మధన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి.

ఆధ్యాత్మికంగా శంఖం 
శంఖం ఆధ్యాత్మికంగా చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందింది. దక్షిణావర్త శంఖం ఎంతో శ్రేష్ఠమైంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అదే విధంగా అర్జునుడి శంఖాన్ని దేవదత్తంగానూ, భీముని శంఖం పౌండ్రకం అనీ, యుధిష్ఠరుని శంఖాన్ని అనంత విజయమనీ, నకులుని శంఖాన్ని సుఘోషనామంతో, సహదేవుని శంఖాన్ని మణిపుష్ప అన్న పేర్లతో పిలుస్తారని మహాభారతకథ చెబుతుంది. వైరివర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖాన్ని పూరించడమన్నది యుద్ధ నియమాలలో ఒకటి. విజయ సూచికంగా కూడా శంఖాన్ని పూరించడమన్నది ఓ ఆచారం.  

లక్ష్మీ, శంఖం సముద్ర తనయలని విష్ణుపురాణం చెబుతోంది. వరుణుడు, చంద్రుడు, సూర్యుడు శంఖం యొక్క పీఠభాగంలోనూ, ప్రజాపతి ఉపరితలం మీద, గంగా సరస్వతులు ముందు భాగంలో ఉంటారు. విష్ణు మూర్తి దుష్ట శక్తులను పారద్రోలడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది.

నిజానికి శంఖం జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు. శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు అనే నానుడి మనకు తెలిసినదే. నవ నిధులు, అష్టసిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు. ఫూజా, ఆరాధన, యఙ్ఞాలు, తాంత్రిక క్రియలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక, ధార్మిక ఉత్సవాలు, యఙ్ఞాలు, శివరాత్రి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు. శంఖాన్ని పూజించడంతో పాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు. శంఖాన్ని పూజిస్తారు. 

శంఖాలలో వివిధ రకాలున్నాయి. దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం, మధ్యమావర్త శంఖంగా చెప్తారు. వీటిలోనూ లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు ఉన్నాయి. భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలను, విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

పూజ గదిలో దక్షిణావర్త శంఖం 
సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్య్రం వదిలిపోతుంది. అదే విధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి. 

ఫలితాలు
శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది. శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది. మెదడు చురుకుతనం వృద్ధి చెందుతుంది. ఊపిరితిత్తు పనితీరు, శ్వాసక్రియ బాగుంటుంది. శంఖం ఊదడం వల్ల గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి. 

దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగకారకాలైన క్రిములు నశిస్తాయి. శంఖారావం వల్ల మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు. అందువలనే శంఖాన్ని పూరించడం వల్ల గాని, ఆ ధ్వనిని వినడంవలన గాని ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతాయంటారు.

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపులలో చేరాలి అనుకునే వారు, ఈ క్రింది లింకుల మీద క్లిక్ చెయ్యండి

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపులలో చేరాలి అనుకునే వారు, ఈ క్రింది లింకుల మీద క్లిక్ చెయ్యండి

1. https://chat.whatsapp.com/B8Czi4F8kM66LSUcRpAe2o

2. 
https://chat.whatsapp.com/BiqhcyUX6H89wFCWm5liRd

3. https://chat.whatsapp.com/COiZjiWEAdHAfynhMUvjSI

4. https://chat.whatsapp.com/Io0im5zVx4f2TstTq0NIYj

5. https://chat.whatsapp.com/L6pzTybEdztLjTWRY5w4iP

6. https://chat.whatsapp.com/Ctw7H85PFTB77uwKKFnkCl

7. https://chat.whatsapp.com/FTAD8XapQUZACedJnxaTZG

టెలిగ్రామ్: http://t.me/joinchat/AAAAAFjgsZ5e6KQX9WtkhQ

పై సమూహాలలో ఖాళీలు లేకపోతే 99127 31349 కి వాట్సాప్ లో సందేశం పంపగలరు. మీకు వివరాలు పంపబడతాయి

దయచేసి ఈ సందేశాన్ని మీకు తెలిసిన అన్ని వాట్సాప్, ఫేస్బుక్ తదితర సమూహాలకు పంపగలరు. సమూహంలో వీలైనంత మందిని చేర్చి, ధర్మ ప్రచారంలో మీరు కూడా భాగం కండి

ఇట్లు 

సమూహ నిర్వాహకులు

SHADHANACHATHUSTAYA SAMPATHI

 సాధనాచతుష్టయ సంపత్తి

🌹 శమము 🌹


✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ 

దమము  అంటే బాహ్యేంద్రియ నిగ్రహము (ఇంద్రియములు మరియు భోగ్య వస్తువులు మధ్య ) -   ఇంద్రియ నిగ్రహము 

 శమము అంటే అంతరెంద్రియ నిగ్రహము (మనస్సుకు ఇంద్రియములకు  మధ్య  )  - మనో  నిగ్రహము  అని చెప్పినప్పటికీ సాధనా పరముగా రెండు కలిపే జరుగుతూ ఉంటాయి.
 
ప్రాపంచిక వస్తు సంపదలు, విషయ సుఖములందు బంధమున్నదని గ్రహించి విముఖత  కలిగి ఉండి మనస్సును ఇంద్రియములతో కూడనివ్వక ఆత్మ లక్ష్యమందు  నిలుపుట  శమము.
 
మనము గాఢముగా ఏదైనా విషయమును గురించి ఆలోచిస్తున్న సమయమున మన ముందు జరిగిన సంఘటనలను కుడా మనము గుర్తించలేము. అంటే మనస్సు ఇంద్రియములతో జోడిస్తేనే విషయములను గ్రహించాగలుగుతాము.  

కనుక ఇంద్రియ నిగ్రహ సాధనల వలన మనో నిగ్రహము బలపడితే  మనో నిగ్రహ  సాధనల వలన ఇంద్రియములు సులువుగా స్వాధీనమవుతాయి.
 
మనస్సు ఎందుకు బహిర్ముఖము అవుతుంది?
- విషయ సుఖములందు  ఆసక్తి వలన
- విషయ సుఖములకు కావలసిన వస్తు సంపదలను ప్రోగుచేసుకోవలననే  కోరిక వలన విషయాసక్తి

- విషయ వైరాగ్యము వలన, వస్తువుల కున్న పరిమితులు  గుర్తించుట వలన
- వస్తు సంపదలు, విషయ సుఖములందు ఉన్న బంధము, దోషములను గుర్తించుట వలన    తొలగుతుంది.
 
మనస్సు ఎందుకు అలజడికి లోనవుతుంది?
- జగత్తులో వ్యవహార సమయమున ప్రతిఫలము పట్ల  ఆసక్తి కలిగి ఉండుట వలన
- జీవితములో జరుగుచున్న సంఘటనలను అంగీకరించలేక  పోవుట వలనను
 
ఇవి  
- దైవీసమర్పణ  భావనతో, ప్రతిఫలాపేక్ష రహిత కర్మ చేయుట వలన
- ఈశ్వర నియతిని (కర్మను) అంగీకరించుట వలనను  తొలగుతాయి.
 
ఎప్పుడైతే మనస్సు బహిర్ముఖము కాక, అలజడికి లోనుకాక  శాంతముగా ఉంటుందో  అటువంటి మనస్సు ఆత్మ జ్ఞాన విచారణకు, తనను తానూ తెలుసుకొనే దిశగా ప్రాయాణించుటకు అనుకూలముగా ఉంటుంది.
 
ఈ విధముగా మనస్సును శమింప చేయుటను శమము అంటారు.
 
ప్రాణాయామము, జపము,  ఉపాసన మొదలగునవి శమమును పెంపొందించుకొనుటకు ఉపయోగ పడు సాధనలు.
🌹 🌹 🌹 🌹 🌹

DAILY FACTS

నిత్య సత్యాలు



🍂మూసి ఉన్న గుప్పిటి , మూసి ఉన్న మనస్సు యితరులకు
మంచి చేయలేవు . యితరులనుండి మంచిని స్వీకరించలేవు .

 🍂" నేను - నాది " అనే స్థితి నుండి "మనము - మనది " అనే
మహోన్నత స్థాయికి ఎదగాలి నేటి మానవాళి .

 🍂ప్రోత్సాహం కోసం ఎదురు చూడకుండా ఉత్సాహం తో మంచిపనులు చేస్తూ ముందుకు పోవాలి .

 🍂సంక్రమించిన ధనం తో సంతోషాన్ని పొందగలము . కానీస్వయము కృషి తో సంపాదించిన ధనం తో ఆత్మ సంతృప్తిపొందగలము

 🍂కలసి మెలసి జీవించడం బలం . ఒకరినొకరు కలబడటం
బలహీనం .

 🍂తాళంచెవి లేని తాళాలు ఉండవు . పరిస్కారం లేని
సమస్యలు ఉండవు .

 🍂మెల్లగా నడిచినా పర్వాలేదు .అడుగులు లక్యం వైపు ఉంటె గమ్యాన్ని తప్పక చేరుకోగలం .

 🍂అసత్యం తో సాధించిన విజయం కంటే , సత్య మార్గం లో నడచి పొందిన ఓటమి గొప్పది .

🍂 నేను - నాది , నువ్వు - నీది అనే ఈ నాలుగు పదాలు
అనేక సమస్యలకు మూల కారణాలు

🍂 లేనివారికి ఆకలి భాధ , ఉన్నవారికి యింకా కావాలనే
బాధ . నిజానికి యిద్దరివి బాధలే .

 🍂ధనాన్ని సంపాదించడం యెంత కష్టమో , దానిని
రక్షించుకోవడం కూడా అంటే కష్టము .

 🍂గొప్పవారైనా మరణించక తప్పదు . కానీ గొప్పదనానికి
మరణం ఉండదు .

 🍂క్షమా గుణం చేతకానితనం కాదు . క్షమించాలంటే
కొండంత మనో బలం ఉండాలి .

 🍂మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం , మనకు
మనమే మిత్రులం . మనకు సమానమే శత్రువులం .

 🍂మన సమస్యలకు , దుఃఖాలకు మనమే కారణం
యితరులు కారణం అనుట దారుణం .

 🍂యితరులను జయించటానికి ప్రయత్నిమ్చుట కంటే
నిన్ను నీవు జయించటానికి ప్రయత్నిమ్చు .

 🍂మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమే కాదు ,
మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి .

 🍂జ్ఞానాన్ని తెలుసుకోవడం యెంత ముక్ష్యమో , తెలుసుకొన్న
జ్ఞానాన్ని జీవితం లో ఆచరించడం అంతకంటే ముఖ్యం .

 🍂ధనం పరుల పాలు - కుటుంబ సభ్యులు , బంధువులు
స్నేహితులు స్మశానం వరకు - శారీరం చితి పైకి - నీ
కర్మ ఫలితం మాత్రమే నీ వెంట వస్తుంది .

 🍂కర్మలను విత్తనాలతో పోల్చవచ్చును . ఏ విత్తనము వేస్తె ఆ ఫలమునే పొందుతాము . అలాగే నీవు చేసే కర్మలు
ఎటువంటివో అటువంటి ప్రారబ్దాన్ని పొందుతావు .

 🍂ఒక రోజు పూర్తి అయింది అంటే , ఆయుస్సు లో ఒక రోజుతగ్గిందని అర్ధము . అందువలన సత్కర్మలు యెంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది

I AM QUALIFIED QUALIFIED THE QUALITY COUNCIL OF INDIA

MORNING AFFIRMATIONS

 

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA & FITNESS CLASSES AT YOUR DOOR STEPS

My photo
Vijayawada, andhrapradesh, India
I AM YOGA TEACHER

Goolgepay Phone pay Paytm

Donate for our yoga center paytm : 8977277742
YOGA  personal & online yoga training availability anywhere the world

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA &FITNESS CLASSES AT YOUR DOOR STEPS FROM THE POINT OF INDIAN TRADITIONAL YOGA FOCUSED AREA: GENERAL FITNESS & OBESITY(OVERWEIGHT REDUCTION) TRAINING CLASSES AT THE STUDIO COVERING ALL HEALTH PROBLEMS SPECIALIZATION : PRANAYAMA | PRANIC HEALING | MEDITATIVE