Saturday, June 29, 2019

పక్షవాతమును హరించు సిద్ధయోగాలు  -

 *  అక్కలకర్ర , సన్నరాష్ట్రం , శొంఠి మూడింటిని కలిపి పలుచటి కషాయం చేసుకుని ప్రతిరోజు సేవించుచున్న పక్షవాతం హరించును .

 *  కసివింద చెట్టు రసము వెన్నతో కలిపి మర్దన చేయుచున్న పక్షవాతం హరించును .

 *  కుసుమ విత్తనాలతో చేసిన తైలం మర్దన చేయుచున్న పక్షవాతం హరించును .

 *  పక్షవాత రోగులు ప్రతినిత్యం ఖర్జురాలు తినుచున్న చాలా మేలు చేయును .

 *  పక్షవాతం వచ్చి కాలు , చెయ్యి పడిపోతున్న సమయంలో వెంటనే గిద్దెడు తేనె తాగించిన పక్షవాత ప్రభావం పోయి మనిషి సాధారణ స్థితికి చేరును .

 *  కటుకరోహిణి నల్లనిది చూర్ణం చేసి 5 గ్రా చొప్పున తీసుకొనుచున్న పక్షవాతం నివృత్తి అగును.

 *  అంజీరపండు ఎండినది , పెద్ద జీలకర్రతో కలిపి తినుచున్న మేలు జరుగును.

 * పొంగించిన ఇంగువ అనగా గుంట గంటె లో ఇంగువ వేసి గంటెని వేడిచేసిన ఇంగువ పొంగును . శుద్ది అగును. ఇలా శుద్ధిచేసిన ఇంగువ 5 గ్రాముల చొప్పున తేనెతో కలిపి తీసుకొనుచున్న పక్షవాతం పక్షవాతం హరించును .

 పక్షవాతపు రోగులు పాటించవలసిన ఆహార నియమాలు  -

 తినవలసినవి  -

      పాత బియ్యపు అన్నం , గోధుమరొట్టె , గోధుమ జావ , మేక మాంసము , పొట్టేలు మాంసం , కంది పప్పు , కంది కట్టు , బీరకాయ , పొట్లకాయ , లేత వంకాయ ముదురు వంకాయ తినరాదు. లేత మునగకాయ , వెల్లుల్లి , ఉల్లిపాయ , కొయ్య తొటకూర , గలిజేరు కూర , మునగ ఆకు కూర , చిర్రి కూర , కసివిందాకు కూర , ద్రాక్షపండు తియ్యనిది , ఖర్జూరం , ఆవు మజ్జిగ , ఆవునెయ్యి , పటికబెల్లం , పాతబెల్లం , తేనె , ఒంటికి మర్దన చేయించుకోవలెను.

 తినకూడనవి  -

కొత్తబియ్యపు అన్నం , చద్దిఅన్నం , జొన్నన్నం , మొక్కజొన్న , అలసంద , పెసలు , మినుములు , శనగలు , బచ్చలికూర , చుక్కకూర , పెరుగు , మీగడ , సామలు , పిండివంటలు , అతిగా నూనె , కల్లు , కలి , కోడిమాంసం , కాకరకాయ , మామిడిపండ్లు , మామిడికాయలు , చేపలు , పులికడుగు , ఫ్రిజ్ నీరు , కూల్ డ్రింక్స్ , నూనెవేపుళ్ళు , పాతపచ్చళ్లు , అతిగా కారం , చేదుగల పదార్థాలు , సంభోగం , చన్నీటి స్నానం చేయరాదు , చింతపండు పులుపు , మొదట తినిన ఆహారం జీర్ణం కాకమునుపే మరలా భుజించటం , మలమూత్ర నిరోధం , ఉపవాసం , అతిగా కష్టపడకూడదు , చల్లటిగాలికి ఉండరాదు , మంచు , తడిప్రదేశాలలో ఉండరాదు.

         పైన చెప్పినటువంటి పథ్యములు పాటిస్తూ ఔషధసేవన చేయడం వలన రోగి సమస్య నుంచి తొందరగా బయటకి వస్తాడు. పథ్యం చేయకుండా మీరు ఎంత గొప్ప ఔషధాలు సేవించినను సమస్య తగ్గదు. ఆయుర్వేదం నందు పథ్యం అనేది ఔషధాలు కొరకు కాదు. రోగానికి పథ్యం ఉంటుంది. రోగం తగ్గుటకు ఔషధాలు సేవిస్తూ మరొకవైపు రోగాన్ని పెంచే ఆహారం తీసుకోవడం వలన ఔషధం పనిచేయకపోగా రోగం మరింత పెరుగును .

No comments:

Post a Comment

8977277742

I AM QUALIFIED QUALIFIED THE QUALITY COUNCIL OF INDIA

YOGA DOING WIN LIFE

 

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA & FITNESS CLASSES AT YOUR DOOR STEPS

My photo
Vijayawada, andhrapradesh, India
I AM YOGA TEACHER

paytm

Donate for our yoga center paytm : 8977277742